15
1 ✽పరలోకంలో మరో గొప్ప అద్భుతమైన సూచన నాకు కనిపించింది. అదేమంటే, ఏడు ఈతిబాధలు చేతపట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు. ఇవి చివరివి ఎందుకంటే వీటితో దేవుని కోపం తీరిపోతుంది✽.2 ✽నిప్పు✽తో కలిసిన గాజు సరస్సు✽లాంటిది కూడా నాకు కనిపించింది. మృగంమీదా వాడి విగ్రహంమీదా వాడి ముద్రమీద వాడి పేరుకున్న సంఖ్యమీదా గెలుపొందినవారు✽ ఆ గాజు సముద్రంమీద నిలుచున్నారు. వారికి దేవుని తంతి వాద్యాలు ఉన్నాయి. 3 వారు దేవుని దాసుడైన మోషే పాట✽, గొర్రెపిల్ల పాట✽ పాడుతూ, “ప్రభువైన దేవా! అమిత శక్తిగలవాడా! నీ పనులు గొప్పవి✽, ఆశ్చర్యకరమైనవి. పవిత్రులకు రాజా✽! నీ త్రోవలు న్యాయమైనవి✽, యథార్థమైనవి. 4 ప్రభూ! నీవు మాత్రమే పవిత్రుడవు✽ గనుక నీకు ఎవరు భయపడకుండా✽ ఉంటారు? నీ పేరును ఎవరు మహిమపరచకుండా ఉంటారు? నీ తీర్పులు✽ వెల్లడి అయ్యాయి, గనుక జనాలన్నీ✽ వచ్చి నీ సన్నిధిలో ఆరాధిస్తారు” అన్నారు.
5 ఈ సంగతుల తరువాత నేను చూస్తూ ఉంటే పరలోకంలో సాక్ష్యంకోసమైన ఆరాధన గుడారం✽ గర్భాలయం✽ తెరచి ఉండడం నాకు కనిపించింది. 6 ఆ ఏడు ఈతిబాధలు చేతపట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దేవదూతలు ఆ గర్భాలయంలోనుంచి✽ వచ్చారు. వారు శుభ్రమైన, ప్రకాశమానమైన శ్రేష్ఠమైన దుస్తులు తొడుక్కొన్నవారు. వారి ఛాతీమీద బంగారు దట్టి కట్టి ఉంది. 7 నాలుగు ప్రాణులలో✽ ఒక ప్రాణి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న దేవుని కోపం✽తో నిండిన ఏడు బంగారు పాత్రలు ఈ ఏడుగురు దేవదూతలకిచ్చింది. 8 అప్పుడు దేవుని మహిమా ప్రకాశంవల్ల, ఆయన ప్రభావంవల్ల కలిగిన పొగ✽తో గర్భాలయం నిండిపోయింది. అందువల్ల ఏడు దేవదూతల ఏడు ఈతిబాధలు నెరవేరేంతవరకు గర్భాలయంలో ఎవరూ ప్రవేశించలేకపోయారు✽.