11
1 కొలతబద్దలాంటి చేతి కర్ర నాకివ్వబడింది. ఆ దేవదూత నిలుస్తూ ఇలా అన్నాడు: “లేచి దేవుని ఆలయం✽, వేదిక కొలతలు తీసుకొని✽ అందులో ఆరాధించేవారిని లెక్కపెట్టు. 2 అయితే ఆలయం బయటి ఆవరణం కొలత తీసుకోకుండా విడిచిపెట్టు. ఎందుకంటే అది యూదులు కాని జనాలకు ఇవ్వబడింది. వారు నలభై రెండు నెలలు✽ పవిత్ర నగరాన్ని కాళ్ళక్రింద త్రొక్కుతారు✽. 3 నేను నా ఇద్దరు సాక్షులకు✽ బలప్రభావాలు ఇస్తాను. వారు గోనెపట్ట కట్టుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై రోజులు దేవుని మూలంగా పలుకుతారు.”4 వీరు భూలోకానికి దేవుడై ఉన్న వ్యక్తి ముందర నిలుచున్న రెండు ఆలీవ్ చెట్లూ✽ రెండు దీపస్తంభాలూ✽. 5 ఎవరైనా సరే వీరికి హాని చేయజూస్తే వీరి నోటినుంచి మంటలు వచ్చి✽ వీరి శత్రువులను మ్రింగివేస్తాయి✽. వీరికి హాని చేయజూచేవాడెవడైనా సరే వాడు ఇలాగే చంపబడాలి. 6 వీరు దేవుని మూలంగా పలికే రోజులలో వాన ఏమీ రాకుండా ఆకాశాన్ని మూసివేసే అధికారం✽ వారికి ఉంది. అంతే కాక, తమకు ఇష్టం వచ్చినప్పుడెల్లా నీళ్ళు రక్తంగా మార్చడానికీ వాటిమీద, అన్ని రకాల ఈతిబాధలతో✽ భూమిని మొత్తడానికీ కూడా వీరికి అధికారం ఉంది.
7 వీరు తమ సాక్ష్యం పూర్తిగా✽ చెప్పిన తరువాత అగాధంలోనుంచి పైకి వచ్చే✽ క్రూరమృగం వీరిమీద యుద్ధం చేస్తుంది, వీరిని ఓడించి చంపుతుంది✽. 8 ✽వీరి మృత దేహాలు ఆ మహా నగరం వీధిలో పడివుంటాయి. ఆ నగరానికి అలంకారికంగా సొదొమ అనీ ఈజిప్ట్ అనీ పేరు. అక్కడే మన ప్రభువు సిలువ పాలయ్యాడు. 9 ✽ఆయా ప్రజలలో, వంశాలలో, భాషలవారిలో, జాతులలో కొందరు మూడున్నర రోజులు వీరి మృత దేహాలను చూస్తూ వాటిని సమాధి చేయనివ్వరు. 10 ✽ఈ ఇద్దరు ప్రవక్తలవల్ల భూనివాసులు వేదనపాలయ్యారు గనుక వీరి చావును బట్టి భూనివాసులు వీరి గురించి సంతోషంతో ఉప్పొంగిపోతూ సంబరపడుతూ ఉంటారు, ఒకరికొకరు బహుమతులు పంపుకొంటారు.
11 ✽అయితే ఆ మూడున్నర రోజుల తరువాత దేవునినుంచి జీవ శ్వాస ఈ ప్రవక్తలలోకి వచ్చింది. వారు లేచి నిలబడ్డారు. వారిని చూచినవారు అధికంగా హడలిపోయారు✽. 12 ✽“ఇక్కడికి పైకి రండి” అని పరలోకంనుంచి పెద్ద స్వరం తమతో అనడం ఈ ప్రవక్తలు విన్నారు. వారి విరోధులు చూస్తూ ఉండగానే వారు మేఘం✽లో పరలోకానికి పైకి వెళ్ళిపోయారు. 13 ✽ఆ ఘడియలోనే పెద్ద భూకంపం కలిగింది. ఆ నగరంలో పదో భాగం కుప్పకూలింది. ఆ భూకంపానికి ఏడు వేలమంది చనిపోయారు. మిగిలినవారు ఎంతో భయపడుతూ పరలోక దేవుణ్ణి మహిమపరచారు.
14 రెండో విపత్తు✽ గతించింది. ఇదిగో మూడో విపత్తు త్వరగా వస్తూ ఉంది✽.
15 ✽ఏడో దేవదూత బూర ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించి ఇలా పలికాయి✽:
“భూలోక రాజ్యాలు✽ మన ప్రభు రాజ్యాలు, ఆయన అభిషిక్తుని రాజ్యాలు అయ్యాయి✽. ఆయన శాశ్వతంగా✽ పరిపాలిస్తాడు.”
16 అప్పుడు, దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు✽ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు:
17 ప్రభూ అమిత శక్తిగల దేవా! పూర్వముండి ప్రస్తుతముంటూ✽ రానై ఉన్నవాడా! నీ మహా బల ప్రభావాలు ప్రయోగించి రాజ్య పరిపాలన చేశావు, గనుక మేము నీకు కృతజ్ఞతలు✽ అర్పిస్తున్నాం. 18 జనాలు కోపగించాయి.✽ నీ కోపం వచ్చింది.✽ చనిపోయినవారికి తీర్పు తీర్చే సమయమూ✽, నీ దాసులైన ప్రవక్తలకూ పవిత్రులకూ నీ పేరంటే భయభక్తులున్న✽ ఘనులకైనా అల్పులకైనా బహుమతులు ఇచ్చే సమయమూ✽, భూమిని నాశనం చేసేవారిని✽ నాశనం చేసే సమయమూ వచ్చింది.”
19 అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరచుకొంది. ఆయన ఆలయం✽లో ఆయన ఒడంబడిక పెట్టె✽ కనిపించింది. మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, గొప్ప వడగండ్లు✽ కలిగాయి.