యాకోబు రాసిన పత్రిక
గ్రంథకర్త
రచయిత యాకోబు (1:1). ఇతడు యెరూషలేము సంఘంలో ముఖ్య నాయకుడు, యేసు క్రీస్తు సోదరుడు. ఉన్నది గనక అందరికన్నా పెద్ద తమ్ముడు. మొదట్లో ఇతడు ఎసుపై నమ్మకం ఉంచలేదు. ఆయన చేయడానికి వచ్చిన పనిని అర్థం చేసుకోలేదు (యోహాను 7:2-5). తరువాతి కాలంలో సంఘంలో ప్రముఖుడయ్యాడు. తన పునరుత్థానం తరువాత క్రీస్తు కనిపించిన కొద్ది మందిలో ఇతడు ఒకడు (కొరింతి 15:7). పౌలు ఇతన్ని సంఘంలో ఆధార స్థంభం అని పిలిచాడు. (గలతి 2:9).
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 47 - 50
క్రీ. శ. 50 లో యెరుషలేములో జరిగిన సమాలోచన సభకు ముందు, క్రీ. శ. 70 లో యెరుషలేము దేవాలయం ధ్వంసం జరగకముందు.
స్వీకర్త
యూదయ, సమరయల్లోచెదరి ఉన్న యూదు విశ్వాసుల కోసం ఈ పత్రిక రాసి ఉండవచ్చు. అయునప్పటికి, పత్రిక ఆరంభంలో “జాతుల మధ్య చెదరి ఉన్న పన్నెండు గోత్రాల వారికి” అనే అభివాదాన్ని బట్టి యాకోబు ఇలా ఆ ప్రాంతమంతా విస్తరించి ఉన్న యూదులను ఉద్దేశించి రాశాడనుకోవచ్చు.
ప్రయోజనం
ఈ గ్రంథ ప్రయోజనం కోసం మనం 1:2-4 చూడాలి. తన తొలిపలుకుల్లో యాకోబు “మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానావిధమైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి” పత్రిక చదివే వారికి చెప్పాడు. దీన్ని బట్టి వారు వివిధ రకాల బాధలు ఎదుర్కొంటూ ఉన్నారని తెలుస్తున్నది. వారు దేవుని నుండి జ్ఞానం కోరుకోవాలని (1:5) ఆ విధంగా తమ బాధల్లో వారు ఆనందంగా ఉండగలరు. లేఖ అందుకున్న వారిలో కొందరు విశ్వాసం నుండి తప్పిపోయిన వారున్నారు. లోకం తో స్నేహం చేయడం (4:4) ప్రమాదమని యాకోబు హెచ్చరించాడు. విశ్వాసులు గురించిన సూచనలు మనస్సు జ్ఞానానికి మార్గం (4; 8-10).
ముఖ్యాంశం
యథార్థమైన విశ్వాసం
విభాగాలు
1. అసలైన మత విశ్వాసం గురించి సూచనలు — 1:1-27
2. నిజమైన విశ్వాసం సత్కార్యాల్లో కనిపిస్తుంది — 2:1-3:12
3. నిజమైన జ్ఞానం దేవుని నుండి వస్తుంది — 3:13-5:20