ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక తాను రాశాడని (1:1) చెప్పాడు. అంతర్గత లక్షణాలు, శైలి, చారిత్రిక అంశాలు దీన్ని దృఢపరుస్తున్నాయి. అది సంఘం కూడా ఈ పత్రిక రచన, అధికారం పౌలుదేనని వక్కాణించింది. ఫిలిప్పి పత్రిక క్రీస్తు మనస్సును ఆవిష్కరించింది (2:1-11). ఈ లేఖ రాసినప్పుడు పౌలు ఖైదీ అయినప్పటికీ అతడు పూర్ణానందం తో ఉన్నాడు. కష్టాల కడలిలో, బాధల్లో సైతం క్రైస్తవులు ఆనందంగా ఉండగలరని ఫిలిప్పి పత్రిక నేర్పిస్తున్నది. క్రీస్తులోని నిరీక్షణ మూలంగా మనం ఆనందంగా ఉండగలం.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 60 - 63 మధ్యభాగం
రోమ్ లో చెరలో ఉండి పౌలు ఈ పత్రిక రాశాడు. (అపో. కా. 28-30). ఈ పత్రికను ఎపఫ్రోదితు ఫిలిప్పి సంఘానికి తీసుకుపోవాలి. ఇతడు ఫిలిప్పి సంఘం నుంచి పౌలుకు ఆర్ధిక సాయం తీసుకుని వచ్చాడు. (2:25; 4:18). అయితే అతడు రోమ్ లో ఉన్న కాలంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తిరుగు ప్రయాణం ఆలస్యం అయింది. అందుకని పౌలు ఇతని ద్వారా ఈ లేఖ పంపుతున్నాడు (2:26-27).
స్వీకర్త
ఫిలిప్పి నగరంలోని క్రైస్తవ సంఘం. ఇది మాసిడోనియా జిల్లాలో ప్రధాన నగరం.
ప్రయోజనం
చెరలో తన పరిస్థితులు (1:12-26), విడుదల గనక కలిగితే తన పథకాలు (1:23 24) ఫిలిప్పి విశ్వాసులకు తెలియజేయాలని పౌలు ఆశించాడు. సంఘంలో కొన్ని విభేదాలు, విరోధాలు ఉన్నట్టు కనిపించింది. అందువల్ల అపోస్తలుడు సంఘ ఐక్యత దృష్ట్యా వినయగుణం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తూ రాశాడు (2:1-18; 4:2-3). కాపరి గుణగణాలకు సంబంధించిన సిద్ధాంతం తెలిసిన వాడుగా కొందరు భిన్న బోధకుల హానికరమైన బోధలకు వ్యతిరేకంగా ఈ లేఖ రాశాడు (3:2, 3). తిమోతిని సంఘానికి పరిచయం చెయ్యడానికి, ఎపఫ్రోదితు ఆరోగ్య పరిస్థితి, అతని ఉద్దేశాలు తెలియజేయడానికి పులు ఈ లేఖ రాశాడు. సంఘం పంపిన కానుకలను బట్టి వారికి కృతజ్ఞతలు తెలిపాడు (4:10-20).
ముఖ్యాంశం
ఆనంద జీవనం
విభాగాలు
1. అభినందనలు — 1:1, 2
2. పౌలు స్థితి, సంఘానికి ప్రోత్సాహం — 1:3-2:30
3. భిన్న బోధల విషయంలో హెచ్చరికలు — 3:1-4:1
4. అంతిమ ప్రోత్సాహ వాక్కులు — 4:2-9
5. కృతజ్ఞతలు — 4:10-20
6. చివరి శుభాకాంక్షలు — 4:21-23