ఎఫెసీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
1:1 ప్రకారం ఎఫెసి పత్రిక రచయిత అపోస్తలుడు పౌలు. సంఘం ఆరంభ కాలం నుంచీ ఈ పత్రిక రాసినది పౌలేనని ఎంచారు. ఆరంభ అపోస్తలిక పితరులు రోమ్ నివాసి క్లెమెంటు, ఇగ్నేషియస్, హెర్మే, పాలికార్పు దీన్నే సమర్థించారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 60 - 63
రోమ్ లో చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఇది రాసి ఉంటాడు.
స్వీకర్త
ముఖ్యంగా ఎఫెసు సంఘం. తన లేఖ అందుకుంటున్న వారు యుదేతరులని పౌలు స్పష్టంగా గుర్తించాడు. 2:11-13 లో వారు పుట్టుకతో యూదేతరులు అని చెప్పాడు. కాబట్టి యూదులు వీరిని “వాగ్దాన నిబంధనకు నోచుకోని వారుగా ఎంచారు (2:12). పౌలు ఈ ఎఫెసీయులకు “యూదేతరులైన మీకు నేను ఖైదీని” అని రాస్తున్నాడు.
ప్రయోజనం
క్రీస్తును పోలిన పరిణతి కోసం ఎదురు చూసే వారు తన లేఖ అందుకోవాలని పౌలు కోరాడు. నిజమైన దేవుని పిల్లలుగా ఎదగాలంటే అవసరమైన విషయాలు ఈ పత్రికలో పొందు పరచాడు. అంతేకాదు, ఎఫెసి పత్రిక పారాయణం విశ్వాసిని బలపరచి దేవుడిచ్చిన పిలుపునూ ఉద్దేశాన్ని అతనిలో నెరవేరుస్తుంది. ఎఫెసు విశ్వాసులు తమ క్రైస్తవ జీవితంలో బలపడేందుకు సంఘం యొక్క నైజం, ప్రయోజనం పౌలు వివరిస్తున్నాడు. యూదేతర క్రైస్తవులకు వారు గతంలో పాటించిన మతం మూలంగా పరిచయం ఉన్న అనేక పదాలు ఈ పత్రికలో కనిపిస్తున్నాయి. శరీరం, శిరస్సు, సంపూర్ణత, మర్మం యుగం, పరిపాలకుడు మొదలైనవి. క్రీస్తు ఎలాటి దేవతాగణం కన్నా ఆత్మ జీవులకన్నా ఎంతో ఉన్నతుడు అని నిరూపించడానికి పౌలు ఈ పదాలు వాడాడు.
ముఖ్యాంశం
క్రీస్తు ఇచ్చే దీవెనలు.
విభాగాలు
1. చర్చి సభ్యులు కోసం సిద్ధాంతములు — 1:1-3:21
2. చర్చ్ సభ్యులు కోసం విధులు — 4:1-6:24