ఎస్తేరు
గ్రంథకర్త
రచయిత ఎవరో తెలియదు. అయితే ఇతడు పారశీక రాజాస్థానం గురించి బాగా పరిచయం ఉన్న యూదుడు. రాజాస్థానం లోని జీవన విధానం, సంప్రదాయాల గురించిన వర్ణనలు, ఈ గ్రంథంలోని సంభవాలు మొదలైన వాటిని బట్టి చూస్తే ఒక ప్రత్యక్ష సాక్షి ఈ పుస్తకం రాసినట్టు అర్ధమవుతున్నది. జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చిన శేషప్రజను ఉద్దేశించి ఇతడు ఈ పుస్తకం రాశాడని పండితులు ఊహిస్తున్నారు. అయితే పుస్తకంలో అతన్ని గురించి గొప్పగా రాయడం వేరొక వ్యక్తి రాశాడనే అభిప్రాయం కలిగిస్తున్నది. అతని కాలంలో వయసులో చిన్నవాడెవరో రాసి ఉండవచ్చు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 465 - 358
పారసీక రాజు జెరిజిస్ పరిపాలన కాలంలో రచన జరిగింది. పారసీక రాజధాని షూషను కోటలో ఈ సంగతులన్నీ జరిగాయి.
స్వీకర్త
చీట్ల పండగ లేక పూరీము ఎలా మొదలైనదీ యూదులకు తెలియలని ఈ పుస్తకం రాయడం జరిగింది. పూరీము పండగ యూదులను దేవుడు రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి జరుపుకుంటారు. ఇది ఈజిప్టు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజల విడుదల వంటిదే.
ప్రయోజనం
మానవ సంకల్పానికీ దైవ సంకల్పానికీ మధ్య జరిగి ఘర్షణను చూపించడమే ఈ పుస్తకం ఉద్దేశం. జాతి పరమైన ద్వేషం అంటే దేవునికి అసహ్యం. ప్రమాద సమయాల్లో ఆయన తన ప్రజలకు జ్ఞానమిచ్చి సహాయం చేస్తాడు. తన ప్రజల జీవితాల్లో ఆయన హస్తం కనిపిస్తూ ఉంటుంది. మనుషులందరి నిర్ణయాలనూ చర్యలనూ ఉపయోగించుకుని తన చిత్తనుసారంగా, తన పథకాలను ఉద్దేశాలను ఆయన నెరవేర్చుకుంటాడు. ఎస్తేరు గ్రంథం పూరీము పండగ ఉనికిలోకి వచ్చిన వైనాన్ని తెలియజేస్తున్నది. నేటికీ యూదులు పూరీము సమయంలో ఎస్తేరు గ్రంథం చదువుకుంటారు.
ముఖ్యాంశం
జాతి అంతరించి పోకుండా కాపుదల.
విభాగాలు
1. ఎస్తేరు రాణి కావడం — 1:1-2:23
2. దేవుని ప్రజ యూదులకు వాటిల్లిన ప్రమాదం — 3:1-15
3. ఎస్తేరు, మొర్దేకై తీసుకున్న చర్యలు — 4:1-5:14
4. యూదులకు రక్షణ — 6:1-10:3