యెహెజ్కేలు
గ్రంథకర్త
బూజీ కుమారుడు, యాజకుడు, ప్రవక్త అయిన యెహెజ్కేలు. ఇతడొక యాజక కుటుంబంలో యోరుషలేములో పెరిగాడు. బబులోను చెర కాలంలో యూదులతో కలిసి జీవించాడు. యెహెజ్కేలు ప్రవచనాల్లో అతడి యాజక వంశ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తరచుగా అతడు ఆలయం, యాజకత్వం, ప్రభువు మహిమ, బలి అర్పణల వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు.
రచనా కాలం, ప్రదేశం
క్రీ. పూ. 593 - 573
యెహెజ్కేలు బబులోనులో ఈ పుస్తకం రాశాడు. ఇశ్రాయేలు, ఈజిప్టు, అనేక ఇతర ఇరుగుపొరుగు జాతుల గురించి ప్రవచనాలు పలికాడు.
స్వీకర్త
బబులోనులోను, స్వదేశంలోను ఉన్న ఇశ్రాయేలీయిలు. తరువాత కాలాల్లో చదివేవారంతా
ప్రయోజనం
తీవ్ర పాపాల్లో ఉండి, ఎంత మాత్రం నిరీక్షణ లేని తన వారినికి యెహెజ్కేలు పరిచర్య జరిగించాడు. తన ప్రవచన పరిచర్య ద్వారా ఆ జాతిని తక్షిణ పశ్చాత్తాపానికి, రానున్న యుగంలో ఆత్మనిబ్బరం కలిగించడానికి ప్రయత్నించాడు. దేవుడు మానవ వార్తాహరుల ద్వారా పనిచేస్తాడని అతడు నేర్పించాడు. ఓటమిలోను, నిరాశలోను దేవుని ప్రజలు ఆయన సార్వభౌమత్వాన్ని ఒప్పుకోవాలి. దేవుని వాక్కు ఎన్నటికీ విఫలం కాదు. దేవుడు అంతటా ఉన్నాడు. ఎక్కడైనా ఆయన్ను ఆరాధించవచ్చు. యెహెజ్కేలు గ్రంథం మనం చీకటి కాలంలో సైతం దిక్కు తోచని సమయాల్లో సైతం దేవుణ్ణి వెదకాలని గుర్తు చేస్తున్నది. మనం మన బ్రతుకులు పరీక్షించుకోవాలి. ఏకైక నిజ దేవునితో ఏకీభవించాలి.
ముఖ్యాంశం
ప్రభువు మహిమ
విభాగాలు
1. యెహెజ్కేలు పిలుపు — 1:1-3:27
2. యోరుషలేము, యూదయ, ఆలయాలకు వ్యతిరేకంగా ప్రవచనాలు — 4:1-24:27
3. ఇతర జాతులకు వ్యతిరేకంగా ప్రవచనాలు — 25:1-32:32
4. ఇశ్రాయేలీయిలు గురించి ప్రవచనాలు — 33:1-39:29
5. పూర్వక్షేమస్దితి కలుగుతుందన్న దర్శనం — 40:1-48:35