2 దినవృత్తాంతాలు
గ్రంథకర్త
యూదుల సంప్రదాయం ప్రకారం ఈ పుస్తకం రాసినది ఎజ్రా శాస్త్రి. ఇది సోలొమోను పరిపాలన వర్ణనతో ఆరంభం అవుతుంది. సోలొమోను మరణం తరువాత రాజ్యం రెండుగా చీలింది. ఇది 1 దినవృత్తాంత గ్రంథానికి జోడుగ్రంథం. సోలొమోను పాలన నుండి బబులోను చెర కాలం దాకా హెబ్రీ ప్రజల చరిత్రను ఇది ఆవిష్కరిస్తున్నది.
రచనా కాలం, ప్రదేశం
సూమారు క్రీ. పూ. 450 - 425
దినవృతాంత గ్రంథాల రచన కాలాన్ని నిర్ణయించడం దుర్లభం. అయితే ఇశ్రాయేలు బబులోను చెరనుండి తిరిగి వచ్చాక గ్రంథరచన జరిగిందనేది స్పష్టం.
స్వీకర్త
ప్రాచీన యూదా ప్రజలు, బైబిలు చదివేవారంతా.
ప్రయోజనం
2 దినవృత్తాంతాలు గ్రంథంలో స్థూలంగా 2 సమూయేలు, 2 రాజులు గ్రంథాల్లోని చరిత్రే ఉంటుంది. అయితే ఈ గ్రంథం ఆ కాలం నాటి యాజక వ్యవహారాలను ప్రత్యేకంగా పేర్కొంటున్నది. జాతి యొక్క మత చరిత్రను అంచనా వేయడం దీని ప్రత్యేకత.
ముఖ్యాంశం
ఇశ్రాయేలు ఆధ్యాత్మిక వారసత్వం.
విభాగాలు
1. సొలొమోను పాలన క్రింద ఇశ్రాయేలు — 1:1-9:31
2. రెహబాము నుండి ఆహాజు వరకు — 10:1-28:27
3. హిజ్కియా నుండి యూదా రాజ్య అంతం వరకు — 29:1-36:23